అమరావతి: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాలు 55 నిమిషాల్లోనే అందనున్నాయి……
ఇందుకు అవసరమైన టెస్టింగ్ కిట్లను విశాఖలోని మెడ్టెక్ జోన్ అందుబాటులోకి తెచ్చింది. ముందుగా 100 కిట్లను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిశీలనకు పంపింది…..
వాటి పనితీరును ఐసీఎంఆర్ పరిశీలించి, వినియోగానికి అనుమతించిందని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు…
ఏఎంటీజడ్లోని రెండు పరిశ్రమలు ఈ కిట్ల తయారీని ప్రారంభించాయి…..
ఐసీఎంఆర్ నుంచి అనుమతులు రావటంతో ఉత్పత్తిని పెంచనున్నాయి. కొద్దిరోజుల్లో సుమారు 500 టెస్టింగ్ కిట్లను సీఎం చేతులమీదుగా ప్రారంభించే అవకాశముంది…..
నెలరోజుల్లో 25వేల కిట్లను తయారుచేస్తారని పరిశ్రమల శాఖ అధికారి తెలిపారు…..